మరికాసేపట్లో కరీంనగర్‌కు సీఎం కేసీఆర్?

by Disha Web Desk 2 |
మరికాసేపట్లో కరీంనగర్‌కు సీఎం కేసీఆర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానతో తీవ్రస్థాయిలో పంటనష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను ఇప్పటికే అన్ని జిల్లాల అధికారుల నుంచి సేకరించిన సీఎం నివేదికల పరిశీలన అనంతరం వర్ష ప్రభావిత ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలించే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, రాష్ట్రంలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులకు 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Also Read:

నర్సంపేటకు సీఎం కేసీఆర్.. హెలిప్యాడ్ సిద్ధం!

Next Story

Most Viewed